పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో భారీ లాభం! రూ. 2.25 లక్షల పెట్టుబడిపై రూ. 98,016 వడ్డీ

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో రూ. 2.25 లక్షలు పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో రూ. 98 వేలకుపైగా వడ్డీ లభించనుండగా, పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

భవిష్యత్తు కోసం సురక్షితమైన పెట్టుబడి మార్గాలను వెతుకుతున్న వారికి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం మంచి అవకాశంగా మారుతోంది. ప్రభుత్వ హామీతో నడిచే ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం లేకుండా స్థిరమైన రాబడి పొందవచ్చు.

ఈ పథకంలో ముఖ్యంగా 5 ఏళ్ల కాలపరిమితి ఉన్న డిపాజిట్‌పై మంచి వడ్డీ అందుతోంది. ఒకవేళ పెట్టుబడిదారు రూ. 2.25 లక్షలు డిపాజిట్ చేస్తే, ఐదేళ్ల తర్వాత కేవలం వడ్డీ రూపంలోనే రూ. 98,016 వరకు లాభం లభిస్తుంది. దీంతో మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ. 3,23,016 చేతికి వస్తాయి.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతాను కేవలం రూ. 1,000తో ప్రారంభించవచ్చు. ఆ తర్వాత రూ. 100 గుణితాల్లో ఎంతైనా జమ చేయొచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేకపోవడం మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు.

కాలపరిమితి పరంగా 1 సంవత్సరం నుంచి 5 ఏళ్ల వరకు వివిధ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 1 సంవత్సరానికి 6.9 శాతం, 2 ఏళ్లకు 7 శాతం, 3 ఏళ్లకు 7.1 శాతం, 5 ఏళ్లకు 7.5 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇందులో 5 ఏళ్ల డిపాజిట్‌కే అత్యధిక రాబడి లభిస్తోంది.

వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కించి, సంవత్సరానికి ఒకసారి ఖాతాలో జమ చేస్తారు. దీనివల్ల చక్రవడ్డీ ప్రయోజనం కూడా పెట్టుబడిదారులకు అందుతుంది. ముఖ్యంగా పన్ను ఆదా చేయాలనుకునే వారికి ఈ స్కీమ్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద 5 ఏళ్ల టైమ్ డిపాజిట్‌పై పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే మంచి వడ్డీతో పాటు పూర్తి భద్రత ఉండటంతో ఈ పథకంపై ఆసక్తి పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button